మిత్రులారా ఇంతవరకు వరద బాధితులకు మనం చేసింది తొలిదశ సహాయం. ఇంకా ఎవరైనా సహాయం చేయాలని ఉంటే వారికి అవకాశం... ఆత్మకూరు మండలం కొత్తపల్లి గ్రామంలో ప్రజలు అందరూ జాలర్లు. వారి అందరి వృత్తి చేపలు పట్టడం. వలలు కొట్టుకుపోయి వీరంతా నిరాశ్రయులు అయ్యారు. ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిన జాలర్లకు వలలు పంపిణీ చేస్తుంది. కొందరు గుర్తింపు లేనివారు ఉన్నారు. వీరికి వలలు కొనివ్వడానికి కర్నూలులో రచయిత మిత్రుడు ఎం.హరికిషన్ ప్రయత్నిస్తున్నారు. ఒక్కొక్క వల 3000/- అవుతుంది. సైజు పెరిగేకొద్దీ వీటి ధర కూడా భారీగా వుంది. ఒక కుటుంబం నిలబడటానికి ఇది సరిపోతుంది. ఇంకా ఎవరైనా సహాయ కార్యక్రమాలు చేస్తుంటే దయచేసి బియ్యం వంటివి ఇక అక్కర్లేదు. ఇలా స్వల్పకాలికంగా కుటుంబాలను పోషించే కార్యక్రమాలను చేపట్టాలని ఆయన చెప్పారు. సంస్థలు స్వంతంగా పంపిణీ చేయాలి అనుకుంటే పూర్తి వివరాలు ఇవ్వగలం మీరే వారికి ప్రత్యక్షంగా ఇవ్వవచ్చు.ఇంకా ఎవరైనా స్పాన్సర్ చేయదల్చుకుంటే దయచేసి సంప్రదించగలరు.


jeevani.sv@gmail.com
9441032212 hari kishan
9948271023 jeevani

on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo