ఆయన ఓ రాజకీయ నాయకుడు కాదు.. వెండితెర హేరో అంతకన్నా కాదు.. అయనను చివరి చూపు చూడటం కోసం అనంతపురం నగరం జన సంద్రమైంది. అనంతపురం జిల్లాలోని మారుమూల గ్రామీణ పేదలు గుండెల్లో గుడికట్టుకున్న నిలువెత్తు మానవతామూర్తి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఫెర్రర్ నిన్న పరమపదించారు. ఫెర్రర్ అనంతపురం జిల్లాకు రావడం అంటే ఇక్కడి ప్రజలు ఎన్ని జన్మల్లో చేసుకున్న అద్రుష్టమో మరి. విద్య, వైద్యం, వసతి, పర్యావరణం, క్రీడలు, మానసిక శారీరక వికలాంగులకు ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ రంగాలు వివిధ వ్యక్తులు ఎందరికో వీరు జీవితాన్ని ఇచ్చారు. ఫెర్రర్ గురించి, ఆయన స్థాపించిన గ్రామీణాభివ్రుద్ధి సంస్థ గురించి ఇంతకు ముందే ఒక టపా రాశాను. ఆసక్తి ఉంటే గమనించండి. ఫెర్రర్ కుమారుడు మాంచో ఫెర్రర్ మా జిల్లాకు చెందిన యువతిని పెళ్ళిచేసుకున్నారు. సంస్థ కార్యక్రమాలను ఇపుడు ఆయనే చూసుకుంటున్నారు. వీరి సేవలు ఇలాగే కొనసాగాలని, అందుకు కావలసిన స్థైర్యం ,ఆయురారొగ్యాలు మాంచో కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము.


అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI
......FOR UNCARED


on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo